Home Uncategorized జర్నలిస్టులు పెన్ డౌన్ .. కెమెరా డౌన్ కు సిధ్దం

జర్నలిస్టులు పెన్ డౌన్ .. కెమెరా డౌన్ కు సిధ్దం

by Admin Kira
0 comments
  • ఇండ్ల స్థలాలు… జర్నలిస్టుల హక్కు
  • సాధన కోసం ఎటువంటి పోరాటానికైనా టీడబ్ల్యూజేఎఫ్ సిద్ధం
  • అవసరమైతే పెన్ & కెమెరా డౌన్ కూడా చేపడతాం..
  • అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలి
  • జర్నలిస్టుల సంక్షేమమే టీడబ్ల్యూజేఎఫ్ లక్ష్యం
  • మోసపూరిత చర్యలను సహించేది లేదు
  • జర్నలిస్టు రాంబాబు ఇండ్ల స్థలాల దీక్ష విరమణ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఖదీర్, శ్రీనివాసరెడ్డి
  • హక్కుల కోసం పోరాడితే అపనిందలు మోపారు : కె.రాంబాబు
  • కిర9న్యూస్ ఖమ్మం మార్చి 29:
    ఇండ్ల స్థలాలు జర్నలిస్టుల హక్కు.. వాటి సాధన కోసం ఎటువంటి పోరాటానికైనా సిద్ధమని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్ ) ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సయ్యద్ ఖదీర్, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అవసరమైతే పెన్ & కెమెరా డౌన్ లు కూడా చేపడతామన్నారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సాధన కోసం 14 రోజులుగా స్థానిక ప్రెస్ క్లబ్ లో రిలే నిరాహార దీక్ష చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ కొరకొప్పుల రాంబాబుకు ఆదివారం నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. జర్నలిస్టుల సమష్టి ప్రయోజనాల కోసం సంఘటితంగా పోరాడుదామని ఖదీర్, శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. ఆర్థిక, వ్యక్తిగత ఇబ్బందులను సైతం పక్కకు పెట్టి జర్నలిస్టుల సమష్టి ప్రయోజనాల కోసం రాంబాబు దీక్ష తలపెట్టడం అభినందనీయమని, జర్నలిస్టుల పక్షాన ముందుకు వచ్చి దీక్షకు కూర్చున్న తనకు తొలుత అండగా నిలుస్తామన్న సంఘాలు ఆ తర్వాత ముఖం చాటేయడం… వారి మోసపూరిత వైఖరికి నిదర్శనం అని పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వం ద్వారా పలుమార్లు ఇండ్ల స్థలాలు పొందిన వారు… నిబంధనల ప్రకారం ఇప్పుడు మళ్లీ ఇండ్ల స్థలాలు రావని, రానీయరని తమ పదవులు, ప్రాపకం కోసం జర్నలిస్టులను పక్కదోవ పట్టించే చర్యలను టీడబ్ల్యూజేఎఫ్ ఖండిస్తోందన్నారు. జర్నలిస్టుల ప్రయోజనాల కోసం సంఘాలు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి మద్దతు కూడగడతామని, ఇండ్ల స్థలాలు సాధించేందుకు దశల వారీ పోరాటాలకు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అనే తేడా లేకుండా అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇచ్చేంతవరకూ ఉద్యమాలు చేస్తామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటిస్తున్నట్లుగా న్యాయపరమైన చిక్కులు లేకుండా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. తాను నమ్మిన ఓ యూనియన్, మరో యూనియన్ తో కుమ్మక్కై తన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం పట్ల మనోవేదనకు గురైనట్లు రాంబాబు పేర్కొన్నారు. తనను దీక్ష చేపట్టమని చెప్పిన జర్నలిస్ట్ సంఘాల నేతలు ఆ తర్వాత తాను చేస్తున్న దీక్షపై నిందలు వేసే విధంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ నిర్మాణాత్మక సంఘంగా టీడబ్ల్యూజేఎఫ్ నికరమైన ఉద్యమాలు చేస్తోంది కాబట్టే తాను ఈ సంఘం తో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అందుకే తాను ఇప్పటివరకు పని చేసిన టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్)కు, ఆ యూనియన్ ప్రెస్ క్లబ్ కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నానని రాంబాబు ప్రకటించారు. తనకు ఆహ్వానం పలికి అక్కున చేర్చుకున్న టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు దువ్వా సాగర్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దగ్గుబాటి మాధవరావు, జిల్లా కమిటీ సభ్యులు కూరాకుల గోపీ, ఎస్ కే జానీపాష, నలుబోల మధుశ్రీ,
    టీబీజేఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆవుల శ్రీనివాస్, మానుకొండ రవికిరణ్, కెమెరామన్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఫయాజ్, భూక్యా గణేష్, అర్షద్, యూసుఫ్, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment

Kira9 NEWS delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Kira9 NEWS is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird