
- అక్రిడేషన్ కమిటీలో టిడబ్ల్యుజేఎఫ్కు ప్రాతినిధ్యం కోరుతూ వినతి
కిర9న్యూస్ ఖమ్మం, ఫిబ్రవరి 24: ఖమ్మం జిల్లా అక్రిడేషన్ కమిటీలో టిడబ్ల్యుజేఎఫ్కు ప్రాతినిధ్యం కల్పించాలని, జిల్లా అధ్యక్షుడు సంతోష్ చక్రవర్తిని సభ్యుడిగా నియమించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య జిల్లా కలెక్టర్కు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. జిల్లాలో అక్రిడేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ పారదర్శకంగా, నిష్పాక్షికంగా సాగాలంటే జర్నలిస్టు సంఘాలకు తగిన ప్రాతినిధ్యం అవసరమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా నియోజకవర్గ స్థాయి రిపోర్టర్లు, చిన్న పత్రికల విలేకరుల సమస్యలను సమర్థవంతంగా కమిటీలో ప్రస్తావించేందుకు టిడబ్ల్యుజేఎఫ్కు అవకాశం కల్పించాలని లేఖలో వివరించారు. ఈ లేఖ ప్రతిని జిల్లా డిపిఆర్వో కి అందజేసినట్లు నాయకులు తెలిపారు. వినతి పత్రం సమర్పణ కార్యక్రమంలో జిల్లా నాయకులు, సంఘ ప్రతినిధులు పాల్గొని తమ మద్దతు తెలిపారు.
జిల్లా పరిపాలన జర్నలిస్టుల హక్కులను గౌరవిస్తూ, సముచిత నిర్ణయం తీసుకుని కమిటీలో టిడబ్ల్యుజేఎఫ్కు ప్రాతినిధ్యం కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల ఐక్యత, హక్కుల పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజెఎఫ్ జిల్లా అధ్యక్షులు సంతోష్ చక్రవర్తి, కార్యదర్శి నానబాల రామకృష్ణ, కోశాధికారి అర్వపల్లి నగేష్, టీబీజేఎ జిల్లా కోశాధికారి కాసోజు శ్రీధర్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంతోటి శ్రీనివాస్, పట్టణ సహాయ కార్యదర్శి చిన్నంశెట్టి రాంబాబు, గౌరవరపు జగదీష్, మామిడాల వీరబాబు, ఎలిసెట్టి రామకృష్ణ బాబు, వంగ పుంగమ గౌడ్, కరాటే వేణు, పాగా యేనా, భాగ్యరాజ్, సందీప్, పవన్ తదితరులు పాల్గొన్నారు.